దర్శకుడిగా తన స్టామినా ఏంటో మొదటి మూవీ తోనే నిరూపించుకున్న సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోయిన్ గా తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించిన సందీప్ రెడ్డి వంగ మొదటి మూవీ తోనే ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు.

అర్జున్ రెడ్డి మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఇదే మూవీ ని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా కీయారా అద్వానీ హీరోయిన్ గా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ ని కూడా షేక్ చేసింది. ఇలా టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీ లలో అదిరిపోయే విజయాన్ని అందుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం బాలీవుడ్ యువ స్టార్ హీరో లలో ఒకరు అయిన రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా యానిమల్ అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ లో అనిల్ కపూర్,  సురేష్ ఓబెరాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ మూవీ ని గ్యాంగ్ స్టార్ డ్రామా తో తెరకెక్కిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ కి సందీప్ రెడ్డి వంగా సొంత వర్షన్ ని ఆడ్ చేసి తీస్తున్నాడు అని ఒక టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ రెండు మూవీ లు కూడా బ్లాక్బస్టర్ విజయాలను అందుకోవడం తో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యనిమాల్ సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: