
ఇదే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలలో రాకూడదు అనే ఆలోచనతో ఆయా పార్టీలు వారి అనుకూల మీడియా బీజేపీపై తీవ్రంగా వ్యతిరేక ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో కూడా అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అలాగే తాజాగా హోదా విషయంపై నీతి ఆయోగ్ సిఫారసుల విషయంలో వ్యతిరేక ప్రచారం సాగుతూనే ఉంది. మీడియా నుండి అన్ని పార్టీలు కూడా బీజేపీ ని ఎదగకుండా చూస్తున్నాయి. దీనితో టీడీపీ తో కలిసి నడిచేందుకు సిద్ధం అవుతుంది.
ఎప్పుడైతే టీడీపీ తో బీజేపీ వ్యతిరేకంగా ఉన్నదో, దానిని ఆయా పత్రికలు విమర్శలతో, వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ అటు కేంద్రంలో కావచ్చు, ఇటు ఆయా రాష్ట్రాలలో కావచ్చు ప్రభుత్వం చిన్న తప్పు చేసినప్పటికీ దానిని కొండత చేసి ప్రజావ్యతిరేకత కూడగట్టడానికి వాళ్ళ శక్తిని మించి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏపీలో విపక్షం మాదిరే దేశంలో బీజేపీని దించడానికి ఈ తరహా ప్రచారాలను ఎంచుకున్నారు. బీజేపీ ఇవన్నీ అర్ధం చేసుకొని కలుపుకొని పోవడానికి చూస్తుంది. అది జరిగితే కాస్తోకూస్తో తెలుగు రాష్ట్రాలలో అదీ ముఖ్యంగా ఏపీలో బ్రతికి బట్టకట్టే అవకాశాలు ఉన్నాయి. చూడాలి బీజేపీ వ్యూహం ఏంటనేది.