గత వారం కరోనా బారిన పడిన ఏపీ గవర్నర్ భిస్వ భూషణ్ హరిచందన్ పూర్తిగా కోలుకున్నారని ఆయన చికిత్స పొందుతున్న ఏఏజి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆయనను కాసేపటి క్రితం ఆస్పత్రి వర్గాలు డిశ్చార్జ్ చేసినట్టుగా ప్రకటన చేసాయి. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేరుకున్నారు. కరోనా వైరస్ నుండి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కోసం ఉన్నతాధికారులు వచ్చారు.

ఘన స్వాగతం పలికిన ఉన్నతాధికారులు రాజ్ భవన్ వరకూ ఆయన వెంటే ఉన్నారు. గన్నవరం నుండి విజయవాడ రాజ్ భవన్ కు గవర్నర్ వెళ్ళారు. ఢిల్లీ టూర్ అనంతరం ఈనెల 15న కరోనా వైరస్ తో హైదరాబాద్ లో గవర్నర్ చికిత్స తీసుకున్నారు. ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap