ఇక ఐపీఎల్ 2023 సీజన్‌లో మ్యాచ్‌లు గతంలో లేని విధంగా చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌లు అయితే చివరి బాల్ వరకు గెలిచే జట్టు ఏదో చెప్పలేని పరిస్థితి నెలకొంది.ఈ క్రమంలో శనివారం నాడు సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య సూపర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఏకంగా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ టీం ఏడో స్థానంకు చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇప్పటి వరకు ఒక్క గెలుపు ఖాతాను కూడా తెరవలేక పోయింది.దీంతో పాయింట్ల పట్టికలో డీసీ టీం చివరి స్థానంలో నిలిచింది.ఢిల్లీ క్యాపిటల్ టీం వరుస ఓటములతో చాలా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. టీం డైరెక్టర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఇంకా ప్రధాన కోచ్‌గా రికీ పాంటింగ్ ఉన్నా ఢిల్లీకి మాత్రం వరుస ఓటములు తప్పడం లేదు. ఈ క్రమంలో మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.


ఢిల్లీ టీం ఓటమి బాధ్యతలను రికీ పాంటింగ్ ఇంకా సౌరభ్ గంగూలీ తీసుకోవాలని, ఈ వరుస ఓటములకు వారిదే బాధ్యత అన్నారు.ఇక గత సీజన్‌లో ఢిల్లీ ఫైనల్స్‌కు చేరినప్పుడు.. ఆ క్రెడిట్ టీం కోచ్ అయిన రికీ పాంటింగ్‌కు దక్కిందని సెహ్వాగ్ అన్నారు. అలా గెలుపు క్రెడిట్ అతని ఖాతాలో పడినప్పుడు ఓటమి బాధ్యతలను కూడా ఖచ్చితంగా తీసుకోవాలని సెహ్వాగ్ చెప్పారు.టీం ఓడినా, గెలిచినా ఖచ్చితంగా కోచ్‌లదే ప్రధాన ప్రాత ఉంటుందని, ప్రస్తుతం ఢిల్లీ వరుస ఓటములకు బాధ్యత కూడా రికీ పాంటింగ్‌ దేనని సెహ్వాగ్ అన్నారు. అయితే, ఇదేమీ ఇండియన్ క్రికెట్ టీం కాదు, అక్కడ ఎవరు గెలిచినా గొప్పగా భావిస్తారు. ఓడితే మాత్రం ఇతరులను నిందిస్తారన్న వీరేంద్ర సెహ్వాగ్.. ఐపీఎల్ లో కోచ్ పాత్ర కేవలం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం మాత్రమే అని అన్నారు. అయితే, ఈసారి ఢిల్లీ టీం మాత్రం అనుకున్నంత గొప్పగా రాణించలేదని, రాబోయే మ్యాచ్ లలో ఢిల్లీ గెలిచి తమ రాతను మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: