
ముందుగా, వెచ్చని నీటి కాపడం చాలా సహాయపడుతుంది. కడుపు లేదా వీపులో నొప్పి ఉన్న చోట హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవడం లేదా వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి నొప్పి తగ్గుతుంది. అలాగే, అల్లం టీ తాగడం కూడా మంచిది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కొద్దిగా అల్లం తురిమి నీటిలో వేసి మరిగించి, వడపోసి తాగవచ్చు.
ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పీరియడ్స్ సమయంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, నొప్పిని తట్టుకునే శక్తిని ఇస్తాయి. కెఫిన్, ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించడం మంచిది, ఎందుకంటే ఇవి నొప్పిని పెంచే అవకాశం ఉంది.
నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు, వజ్రాసనం లేదా భుజంగాసనం వంటి కొన్ని సులభమైన యోగాసనాలు ప్రయత్నించవచ్చు. ఇవి కడుపు భాగంలోని కండరాలను రిలాక్స్ చేసి నొప్పిని తగ్గిస్తాయి. అయితే, కొత్తగా యోగా చేసేవారు నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిది. తేలికపాటి వ్యామాయం కూడా రక్త ప్రసరణను మెరుగుపరిచి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా నొప్పి నివారణకు దోహదపడుతుంది. మీకు తరచుగా తీవ్రమైన నొప్పి వస్తుంటే లేదా ఈ చిట్కాలు పని చేయకపోతే, తప్పకుండా వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు