అనుష్క పేరు అందరికి తెలుసు..సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అమ్మడు..ఆ తర్వాత అరుంధతీ సినిమాతో జెజెమ్మగా మారింది..అలా ఎన్నో హిట్ సినిమాలలో నటించి మెప్పించింది..బాహుబలి సినిమా తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యింది..ఆ తర్వాత భాగమతి సినిమాతో మరో మైలు రాయిని అందుకుంది..ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.ఇలా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. అనుష్క సినిమాలంటే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉండేవి. నిశ్శబ్దం తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్‌పై కనిపించనే లేదు.


ఆ మధ్య యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో అనుష్క నటిస్తుందని ప్రకటించారు. ఇందులో యువ నటుడు నవీన్ పొలిశెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే, అధికారికంగా ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయినా కూడా ఇప్పటివరకు షూటింగ్ మొదలవలేదు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్లారిటీ ఇచ్చేసింది...ఇప్పుడు స్వీటీకి సంబందించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతూంది.

సమంత తో కలిసి అనుష్క స్క్రీన్ షేర్ చేసుకుందని ఇప్పటికే, ఇద్దరు షూటింగ్ కూడా కంప్లీట్ చేశారని ప్రచారం జరుగుతోంది. వివరాలలోకి వెళితే వైవధ్యమైన సినిమాలు తెరకెక్కించే గుణశేఖర్.. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే సినిమా రూపొందించాడు. పౌరాణిక గాథ ఆధారంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రలో, అల్లు అర్హ మొదటిసారి చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు తెరకు పరిచయం అవుతోంది..నీలిమ గుణ క్లారిటీ ఇచ్చారు. అనుష్క మాకు సపోర్ట్ చేస్తున్నదుకు థాంక్స్. అయితే..ఆమె ఈ సినిమాలో నటించలేదు. కానీ, మాతోనే ఉంటూ మాకు తన సహాయాన్ని అందిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.అను, సామ్ కలిసి నటిస్తే చూడాలని చాలా మంది అనుకుంటున్నారు..మరి వారి కోరిక ఎప్పుడూ నేరవెరుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: