తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ తాజాగా స్వాతి ముత్యం అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బెల్లంకొండ గణేష్ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించగా ,   లక్ష్మణ్ కే కృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి హిట్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లు దక్కాయి. 

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో మెప్పించిన స్వాతి ముత్యం సినిమా మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ మూవీ ప్రముఖ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో అక్టోబర్ 28 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా ఆహా  "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ ని ఎవరైనా థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే అక్టోబర్ 28 వ తేదీ నుండి ఈ మూవీ ఆహా  "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: