
అతను ప్రతీ మ్యాచ్ ముగించుకున్న వెంటనే క్రయోథెరఫీ చేయించుకుంటాడు. ఇందుకు ఏకంగా రూ.50వేల ఫౌండ్లు అనగా దాదాపు రూ.51లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనిని ఐస్ బాత్ టబ్ అని కూడా పిలుస్తారు. ఇంటికి వెళ్లిన తరువాత రొనాల్డో 5 నిమిషాల వరకు ఆ టబ్లోనే గడుపుతాడు. స్నానం అనగా మనం సాధారణంగా చేసే నీటితో కాదు. క్రయోథెరఫీ చాంబర్లో -200 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగత వద్ద ప్రత్యేకమైన రక్షణ కవచాన్ని ధరించి వెళ్తాడు.
బాస్కెట్బాల్ తయారీ రంగంలో వాడేటటువంటి చర్మం మాదిరిగా ఉన్న కోటును ధరించి ఆ చాంబర్లోకి చేరుతాడు. అక్కడ లిక్విడ్ నైట్రోజన్ను పంప్ చేస్తుంటుంది. దీంతో శరీరం అత్యంత శీతలంగా తయారవుతుంది. ఈ విధంగా చేయడంతో రక్తప్రసరణ చాలా మెరుగుగా సక్రమంగా సాగుతుంది. రోగ నిరోదకశక్తి సైతం రోజు రోజుకు మెరుగవుతుంది. కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉండాలి. 5 నిమిషాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు తలత్తే అవకాశం ఉంటుంది. నిపుణుల సలహా మేరకు చాంబర్లోకి వెళ్లాలి. రొనాల్డో మాత్రం గత ఏడేండ్ల కాలం నుంచి దీనిని వినియోగిస్తున్నాడు. ఇటలీలోని ఇంట్లో ఉన్న చాంబర్ను ఇటీవల మాన్షన్ వద్దకు మార్చుకున్నాడు.