"శ్రావణమాసం".. హిందూ సంప్రదాయంలో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తూ ఉంటారు . శ్రావణమాసంలో మహిళలు తాంబూలం ఎక్కువగా ఇస్తూ ఉంటారు.  మహిళలు ఎక్కువగా తాంబూలాలు ఈ మాసంలోనే ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు.  అయితే ఎలా పడితే అలా తాంబూలం ఇవ్వడం వల్ల దోషం ఉంటుంది అంటున్నారు పండితులు . మరీ ముఖ్యంగా మరో రెండు రోజుల్లో వరలక్ష్మీ వ్రతం రాబోతుంది . కచ్చితంగా ఈరోజు ముత్తైదువులు తమ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేసుకుంటూ ఉంటారు .  వరలక్ష్మి  వ్రతం పూర్తి అవ్వగానే ముత్తైదువులకు తాంబూలం ఇస్తూ ఉంటారు.  అలా తాంబూలం ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తే అది శుభం తెచ్చి పెట్టకపోగా దోషం మిగులుస్తుంది అంటున్నారు పండితులు . తాంబూలం ఇచ్చేటప్పుడు  చేయకూడని తప్పులు ఏంటి ..? అనేటివి ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!


*తాంబూలంలో కచ్చితంగా రెండు అంతకంటే ఎక్కువ తమలపాకులు ఉండేలా చూసుకోవాలి.

*రెండు వక్కలు.. రెండు పండ్లు ..రెండు పుష్పాలు ..పసుపు - కుంకుమ ..రెండు గాజులు కచ్చితంగా ఉండాలి.  

*అంతేకాదు తమలపాకులను శుభ్రంగా నీటితో కడిగి ఉంచాలి.

*ఆకుపై మచ్చలు ఉన్న ఆకు అశుభ్రంగా ఉన్న అసలు తాంబూలానికి వాడకూడదు.

*అంతేకాదు అరటి పండ్లు.. ఆపిల్ తాంబూలంలో ఇవ్వచ్చు.  అయితే అవి రెండు లెక్కన తీసుకోవాలి. వాటి తొడిమలు కూడా మన వైపు ఉండేలా చూసుకొని తాంబూలం ఇవ్వాలి .

*ఒకరు మనకు బొట్టు పెట్టి ఇచ్చిన పసుపు కుంకుమను వక్కను మరొక ముత్తైదువు స్త్రికి ఇవ్వకూడదు.

*అంతేకాదు పాడైపోయిన అరటి పండ్లను పాడైపోయిన ఆపిల్ పండ్లను అస్సలు తాంబూలంలో పెట్టి ఇవ్వకూడదు .

*మరీ ముఖ్యంగా చీకటి పడక ముందే తాంబూలం ఇవ్వడం మరింత మంచిది .

*ఇలాంటి కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి ఇద్దరికీ మంచిదే దోషం ఉండదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: