ప్రేమ ప్రేమ ప్రేమ.. ఈ రెండు అక్షరాలలో ఏదో తెలియని మత్తు.. ఆ ప్రేమ మత్తు ఇప్పటికి ఎంతో మందిని మాయ చేసింది. ఆ మత్తులో పడ్డా మాయ ప్రేమికులు మరణించడానికి కూడా వెనకాడని మహానుభావులుగా మారతారు. ఈ రెండు అక్షరాల తో మొదలైన ఆ లవ్ ఇప్పటికి ఎన్నో జీవితాలను బలి తీసుకుంది. మరెన్నో జీవితాలను మంచి బాటలోకి వెళ్లేలా చేసింది. ప్రేమిస్తే చచ్చేంత ధైర్యం నీకు ఉన్నప్పుడు, చనిపోవడం ఎందుకు బ్రతికి ఉండి అదే ధైర్యంతో బతుకు పోరుకు బాటలు వేసుకో.. బ్రతికి నీ ప్రేమను బ్రతికించుకో, పదిమందికి చావు శరణ్యం కాదని చాటి చెప్పుకో కానీ నీవు మరణించి నీ ప్రేమను మట్టిలో కలిసేలా చేస్తే ప్రేమ అనే పదానికి మలుపు ఎప్పుడు వస్తుంది.

 ఆలోచించుమా.. అలజడి చెంది ఆలోచన లేకుండా ఆయువు తీసుకోకు, ఆలోచన చేసి ప్రేమ అనే పదానికి ఆయువు పోసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకో.. తప్ప ప్రేమలో విఫలం చెందామని ప్రాణమే తీసుకుంటే నీ ప్రేమకు విలువ లేనట్టే.. నీ ప్రేమను ప్రేమతో గెలవాలి తప్ప, నీ ప్రాణంతో కాదు.. అలాంటి ఓ ప్రేమికురాలు తన ప్రియుడి ఫోటోను బొమ్మ గీసి చివరికి చీకటి గదిలోకి వెళ్లి ఏం చేసిందో తెలుసుకుందామా..! ప్రస్తుత కాలంలో ప్రేమించిన వారి చేతుల్లో మోసపోయాను అనే పేరుతో చాలామంది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనల  రోజు అనేకం చూస్తున్నాం. ఇందులో కొంతమంది భగ్న ప్రేమికులు సెల్ఫీ వీడియోలు పెట్టి మరి లైవ్ గా పురుగుల మందు తాగి లేదా ఉరి వేసుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.అలాగే మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రేమికురాలు ఆత్మహత్యకు పాల్పడింది. తను ప్రేమించిన ప్రియున్ని మర్చిపోలేక సూసైడ్ నోట్ రాసి తన ప్రియుడి ఫోటోలు స్కెచ్ గీసి మరి మరణించింది.

మహబూబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందినటువంటి కొండా లింగమల్లు అనే యువకుడు పోలేపల్లి శరణ్య అనే యువతి గత మూడేళ్లుగా లవ్ ట్రాక్ లో ఉన్నారు. కానీ తన ప్రియుడు లింగమల్లు మాత్రం తనతో వివాహానికి నిరాకరించాడు. దీంతో పెళ్లికి సంబంధించి గ్రామ పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టారు. పెళ్లికి కొంత సమయం కావాలని లింగమల్లు కోరాడు. అయితే అతను కోరిన సమయం ఇచ్చినా అతని నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మనస్తాపానికి గురైన శరణ్య మోసం చేశాడని ప్రాణాలు తీసుకోవాలని భావించింది. దీంతో మంగళవారం సాయంకాలం వేళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి, తన ప్రియుడి ఫోటోను స్కెచ్ తో పేపర్ మీద గీసి, ఉరి వేసుకొని మరణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: