మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య..
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అంతేకాదు చిరంజీవి,  రామ్ చరణ్ కెరియర్ లో కూడా ఇంతకు మించి డిజాస్టర్ లేదని చెప్పడంలో సందేహం లేదు.  ఇకపోతే 2022 ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం  23 కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. 20 ఎకరాల విస్తీర్ణంలో ధర్మస్థలి పేరుతో టెంపుల్ సెట్ వేశారు.

ఇప్పుడు ఈ సెట్  మొత్తం అగ్నికి ఆహుతి అయిందని తెలుస్తోంది.  ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు . అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని సంభవించలేదు కానీ రూ.23 కోట్లతో విజువల్ వండర్ గా అనిపించిన సెట్  మొత్తం అగ్నికి ఆహుతి అవడం నిజంగా బాధాకరమని చెప్పాలి.

అయితే అసలు ఆ మంటలు ఎక్కడినుంచి చెలరేగాయి?  నిప్పు ఎక్కడినుంచి వచ్చింది?  అనేది మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. అయితే ఒక వ్యక్తి ఈ సెట్  బయట కూర్చుని సిగరెట్ కాల్చి పారేయడంతో ఇలా బుగ్గి పాలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సెట్  హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కోకాపేట్ సరస్సు దగ్గర ఈ టెంపుల్ సెట్ ను భారీ గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది . అయితే అది ప్రైవేటు స్థలం కావడంతో ఆ సెట్ ను తీయకుండా అలాగే ఉంచేసారట. చాలామంది దీనిని చూడడానికి వచ్చేవారని తెలుస్తోంది అయితే ఇప్పుడు ఇలా అగ్నికి ఆహుతి అవడంతో ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: