టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రియమణి , అరవింద స్వామి కీలక పాత్రలలో నటించిన ఈ మూవీ కి ఇళయ రాజా , యువన్ శంకర్ రాజామూవీ కి సంగీతం అందించారు. ఈ మూవీ ని మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది. అలాగే ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ మూవీ మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది.

మూవీ మేకర్స్ తాజాగా కస్టడీ మూవీ యొక్క టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లుగా అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఓపెన్ అయిన ఈ మూవీ యొక్క బుకింగ్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా టికెట్ బుకింగ్ లలో తమిళ్ కంటే కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను కూడా తెలుగు , తమిళ భాషల్లో విడుదల చేయగా తెలుగు భాష ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: