ఎన్టీఆర్ హీరోగా నటించిన రాఖీ చిత్రం అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్నా చెల్లెల్ల నేపథ్యంలో ఎంతగానో అలరించింది ఈ సినిమా. ఎన్టీఆర్ నటన దేవిశ్రీప్రసాద్ సంగీతం కృష్ణవంశీ డైరెక్షన్ ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం కాగా అంత పెద్ద హిట్ అవడానికి కారణం మరొకటి కూడా ఉంది. అదే ఈ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలి పాత్ర పోషించిన అమ్మాయి. ఈమె ఎన్టీఆర్ చెల్లెలిగా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇపుడు ఆమె ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో యాంకర్ మంజూష అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఈమె టాలీవుడ్ లో విడుదలయ్యే ప్రతి సినిమా ఈవెంట్ కు యాంకరింగ్ చేయాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రాఖీ సినిమాలో ఈ మంజుషా చెల్లెలి గా నటించి మంచి ఇమేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు కూడా చేసింది. అయితే ఆ సినిమాలు తనకు పెద్దగా వర్కౌట్ కాక పోవడంతో యాంకరింగ్ రంగంలోకి దిగింది. అక్కడ ఆమె సక్సెస్ అయిందని చెప్పవచ్చు. వరుస సినిమా ఈవెంట్ లతో ఫుల్ బిజీగా తన కెరీర్ ను ఉంచుకుంటుంది.

బుల్లితెరపై ఎంతో మంది యాంకర్ లు ఉన్న వారందరినీ దాటుకొని ఆడియో ఫంక్షన్ ల అవకాశాలు తనకే రప్పించుకుంటుంది. సుమ, ఝాన్సీ, ఉదయ భాను, వంటి యాంకర్ లను పక్కన పెట్టి ఈమె కోసం చాలామంది నిర్మాతలు ఎదురుచూస్తూ ఉంటారు. అంతే కాకుండా ఇప్పుడు ఉన్న యంగ్ యాంకర్లు కూడా పోటీ గా ఉన్నా ఆమె తన ప్రత్యేకత చాటుకుని అవకాశాలు అందుకున్నారు.  ఎప్పుడు సినిమా ఫంక్షన్లతో బిజీ బిజీగా ఉంటుంది ఈ క్రేజీ యాంకర్. ఇప్పటివరకు 2500 సినిమా ఫంక్షన్లు చేసింది ఈమె.  దీంతో సెలబ్రిటీలలో సైతం ఆయనకు మంచి పేరు వచ్చింది. ఏ సినిమా విడుదలైన ఇంటర్వ్యూల కోసం అందరు చర్చించే పేర్లలో ఈమె ఉండడం విశేషం. త్వరలో ఈమె జబర్దస్త్ షో లో కూడా కనిపించనుందని ఇండస్ట్రీలో పలు వర్గాలు చెప్పుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: