గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వల్లభనేని వంశీ వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు టిడిపి ఎమ్మెల్సీ మాజీ మంత్రి నారా లోకేష్లా  మీద వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టిడిపి ఎమ్మెల్సీ మాజీ మంత్రి నారా లోకేష్ ను ఎన్టీఆర్ తో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. జూనియర్ ఎన్టీఆర్ కి నారా లోకేష్ పోలికలు ఎక్కడా లేవని విమర్శిస్తే టిడిపి నేతలు తప్పు పడుతున్నారని... జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ కి ఎక్కడ పోలికలు లేవని వాళ్లకు కూడా తెలుసు అని వల్లభనేని వంశీ విమర్శలు గుప్పించారు. 

 

 

 

 అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కి నారా లోకేష్ కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఘాటు విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తన సినిమాల్లో నారా లోకేష్ పై ఓ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. పప్పు అంటూ  విడుదల చేసిన పాటలో నారా లోకేష్ ను  రాంగోపాల్ వర్మ ప్రస్తావించారు . అయితే తాజాగా వల్లభనేని వంశీ ఈ అంశంపై కూడా స్పందిస్తూ నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ ను  పప్పు అని తాను అనలేదని స్పష్టం చేశారు వల్లభనేని వంశీ. 

 

 

 

 తాజాగా మీడియాతో మాట్లాడిన వంశీ మరోసారి లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నారా లోకేష్ ను పప్పు అని తాను అనలేదని... అంతేకాకుండా గున్న,  గున్న ఏనుగు అని కూడా తాను  అనలేదు... దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నాడు అంటూ వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఇంటర్నెట్లో ఏపీ పప్పు అని టైప్ చేస్తే లోకేష్ ఫోటో వస్తుందని ఒకవేళ అలా రాకపోతే ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తానంటూ వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. ఎవరో రామ్ గోపాల్ వర్మ  లోకేష్ ను పప్పు అంటే అతడి బొంబాయిలో ఉంటాడు కాబట్టి అతనికి ఏమీ చేయలేక నన్ను అంటే ఎలా అంటూ వల్లభనేని వంశీ ప్రశ్నించారు. ఒకవేళ రాంగోపాల్ వర్మ ని లోకేష్ ఏమైనా అంటే మళ్ళీ వర్మ ఏం చేస్తాడో  ఏం తీస్తాడో ఏం రిలీస్ చేస్తాడో  అని లోకేష్ భయపడుతున్నారని వంశీ సెటైర్లు వేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: