తమిళనాడు ఆస్పత్రుల్లో గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న అత్యంత దారుణమైన సంఘటన బయటపడింది. ఆస్పత్రుల్లో రోగుల్ని విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తున్న అత్యంత భయానక సంఘటనలు  వెలుగులోకి వచ్చాయి.రోగుల బంధువుల వద్ద డబ్బులు తీసుకుని ఆ వ్యక్తులకు సంబంధించిన రోగులకు విషపు ఇంజెక్షన్ చేసి చంపేస్తున్న దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలా 10 సంవత్సరాలలో 300 ల మంది రోగుల్ని ఓ వ్యక్తి దారుణంగా చంపేశాడు. ఇక వారి బంధువుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. వీడియో ద్వారా ఆ దారుణాల గురించి తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి రోగుల్ని హత్య చేస్తున్న ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.10 సంవత్సరాలుగా దాదాపు 300 మంది రోగులను హత్య చేసినట్లు ఏప్రిల్ 18న ఓ వ్యక్తి వీడియో ద్వారా తెలుసుకున్న తమిళనాడు పోలీసులు ఆ నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. 34 నాలుగేళ్ల మోహన్ రాజు అనే వ్యక్తి ఈ దారుణాలు చేస్తున్నానని వెల్లడించారు. దీని గురించి శుక్రవారం నాడు (ఏప్రిల్ 21,2023) పోలీసులు మీడియాకు వెల్లడించిన వివరాలు చాలా భయానకంగా ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇలా విషపు ఇంజెక్షన్లు చేస్తున్న వ్యక్తే ఈ వీడియోను రిలీజ్ చేయటం..రోగుల బంధువుల కోరిక మేరకే తాను ఇలా వారికి ఇంజెక్షన్లు ఇచ్చి చంపేవాడిని అంటూ ఆ వీడియోలో వ్యక్తి తెలిపాడు.


ఇక నామక్కల్‌ జిల్లా పళ్లిపాలయానికి చెందిన మోహన్‌రాజ్‌ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో పనిచేసే ఓ వ్యక్తి చెప్పిన పనులని చేస్తుండేవాడు. అలా  డబ్బులు సంపాదిస్తుండేవాడు. అలా అతనికి ఆ ఆస్పత్రుల్లో ఉండే రోగుల బంధువులతో పరిచయాలు జరిగాయి. వారిలో వయస్సు మీద పడి, ఆరోగ్యం బాగా క్షీణించిన రోగుల కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఈక్రమంలో అలాంటి రోగులను ఆస్పత్రిలో ఉంచి వారికి సేవలు చేయటం ఇంకా ఇబ్బంది అనుకున్నవారు వారిని వదిలించుకోవాలనుకునేవారు మోహన్ రాజ్ తో ఉన్న పరిచయంతో వారిని చంపాలన్నట్లుగా దానికి వారు డబ్బులు ఇస్తామన్నట్లుగా సమాచారం తెలిసింది.సూదితో విషపు మందు వేసి ఇలా హత్య చేస్తున్నానని..దాని కోసం మొత్తం రూ. 5 వేలు తీసుకుంటున్నానని ఆ వీడియోలో పేర్కొన్నాడు. అలా 10 ఏళ్లలో ఏకంగా 300 మందిని విషపు ఇంజెక్షన్లతో చంపానని మోహన్‌రాజ్‌ పేర్కొన్నాడు. తమిళనాడులోని చెన్నై తో పాటు పలు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఇలాంటి పనులు చేశానని..అలాగే కర్ణాటకలోని బెంగళూరులో కూడా ఇలాంటివి చేయటానికి వెళ్లానని చెప్పాడు.5 వేలు ఇస్తే రెండు నిమిషాలలో పని పూర్తి చేస్తానని పెద్ద ఘనకార్యం చేసినట్లుగా అతను వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో పళ్లిపాలయం పోలీసులు కేసు నమోదు చేసి ఇక మోహన్‌రాజ్‌ని అరెస్టు చేశారు. ఇంకా అంతేకాకుండా 18 మంది ఫేక్ డాక్టర్లతో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: