ప్రతి సంవత్సరం ఎంతోమంది తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు, వారిలో కొంతమంది మొదటి సినిమాతోనే మంచి విజయాలను సాధించి ఆ తర్వాత ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి ముద్దుగుమ్మలో శోభితా ధూళిపాళ ఒకరు, ఈ అందాల ముద్దుగుమ్మ అడవి శేషు హీరోగా తెరకెక్కిన గూడచారి సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శోభితా ధూళిపాళ అడవి శేషు హీరోగా తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

 తెలుగులో ఇండస్ట్రీ లో ఇప్పటికే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ పైన అవుతుంది, ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న శోభితా ధూళిపాళ కు బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఆఫర్ వచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలో శోభితా ధూళిపాళ కు ది నైట్ మేనేజర్ అనే మూవీలో అవకాశం దక్కినట్లు వార్తలు వస్తున్నాయి, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు,  వాస్తవంగా ఈ మూవీ లో మరో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటించాలి.  అయితే కారణాలు ఏంటో తెలియదు గాని ఆ పాత్రలో ఇప్పుడు ఆదిత్య రాయ్ కపూర్ చేస్తున్నట్లు తెలుస్తోంది, ఈ యంగ్ హీరో సరసన శోభిత ధూళిపాళ కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది, ఇలా శోభిత దూళిపాల బాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాన్ని దక్కించుకుంది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: