టాలీవుడ్ హీరో నవదీప్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జై’ సినిమాతో ఇండస్టీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవదీప్. ఆ తర్వాత ‘గౌతమ్ ఎస్.ఎస్.సి’, ‘చందమామ’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించారు. అలాగే తెలుగుతో పాటు ఎక్కువగా తమిళ సినిమాలకు కూడా పని చేశారు నవదీప్. ‘ఆర్య 2’ సినిమా తర్వాత నవదీప్ కు చెప్పుకోదగ్గ సినిమా ఏమీ నవదీప్ కి పడలేదు. అయినా ఆయనకు సినిమా అవకాశాలు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆయన హీరోగానే కాకుండా కథకు బలం ఉండే ఏ పాత్రలోనైనా నటించడానికి రెడీగా ఉంటాడు.సినిమాల్లో కంటే పలు వెబ్ సిరీస్ లలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నవదీప్ తాజాగా మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నవదీప్ రీసెంట్ నటించిన సిరీస్ ‘న్యూసెన్స్’. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవలే విడుదల చేసిన మొదటి టీజర్ కు కూడా చాలా మంచి స్పందన వచ్చింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు రెండో టీజర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్.


ఇక ఈ టీజర్ విషయానికొస్తే.. మొదటి టీజర్ కంటే రెండో టీజర్ ను చాలా ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు మేకర్స్. 2003 వ సంవత్సరంలో మదనపల్లి అనే ఊరిలో జరిగిన కథను బేస్ చేసుకొని ఈ వెబ్ సీరిస్ ఉంటుందని ముందు నుంచీ మేకర్స్ హింట్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఈ రెండో టీజర్ లో కూడా ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. మదనపల్లి చెక్ పోస్ట్ లో ఓ ఎన్కౌంటర్ జరినట్టు వారు చూపించారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు ఇంకా జర్నలిస్ట్ లకు మధ్య జరిగే ఘర్షణలను చూపించారు. ఇందులో పొలిటికల్ యాంగిల్ కూడా బాగానే కనబడుతుంది. ఇక టీజర్ లో డైలాగ్ లు కూడా చాలా బాగా అదిరిపోయాయి. ఇక మొత్తంగా చూస్తే ఈ వెబ్ సిరీస్ మీడియా, పాలిటిక్స్ చుట్టూ తిరిగే ఓ కథలాగా అనిపిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ ఫేమ్ బిందు మాధవి కూడా జర్నలిస్ట్ గా కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: