అక్కినేని హీరోలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైన వారిలో అక్కినేని
నాగార్జున నాగచైతన్య మాత్రమే హీరోలుగా
సక్సెస్ అయ్యారు. మిగతా వారు సరైన హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని హీరోగా తెలుగు తెరకు కాళిదాసు ద్వారా పరిచయమయ్యాడు సుశాంత్. తొలి
సినిమా భారీ ఫ్లాప్ కావడంతో ఎలాంటి నిరుత్సాహం చూపించకుండా కరెంటు సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ
సినిమా సూపర్ హిట్ కావడంతో
సుశాంత్ హీరోగా నిలదొక్కుకోగలను అనే నమ్మకంతో ఉన్నాడు.
ఆ తర్వాత
మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యే క్రమంలో అడ్డా అనే
సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. దాంతో కొంత టైమ్ తీసుకుని సినిమాల్లోకి వచ్చి హిట్ అందుకోవాలని భావించి ఐదు సంవత్సరాల తర్వాత కానీ ఆయన చిలసౌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో చిలసౌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన
సుశాంత్ కి ఆ
సినిమా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ
సినిమా సుశాంత్ కి మంచి నమ్మకం కలిగేలా చేసింది.
ఆ తర్వాత
అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం లో సినిమాలో వెరైటీ పాత్రను పోషించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన ఇచట వాహనాలు నిలుపరాదు అనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ
సినిమా ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేయగా ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ
సినిమా కూడా
సుశాంత్ కు మంచి పేరు తెచ్చి పెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అనే నిర్ణయానికి వచ్చేశారు ప్రేక్షకులు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో
సుశాంత్ ను గైడ్ చేసే వారు ఎవరు అని వారు ఆరా తీస్తున్నారు. మొదటి నుంచి ఆ గైడ్ చేసే వారు ఉంటే
సుశాంత్ కెరీర్ బాగుండు అని అంటున్నారు.