టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకున్నా రవితేజ.. ఇప్పుడు అదే జోష్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక రవితేజ సినిమా అంటే అందులో కచ్చితంగా ఓ హుషారైన పాట ఉండాల్సిందే.

ఇక ఈ సినిమాలో కూడా అలాంటి ఒక ఎనర్జిటిక్ సాంగ్ ఉండబోతుందట. ఇక ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ సూపర్ మ్యూజిక్ అందించినట్లు తెలుస్తోంది. అయితే సాధారణంగా దేవిశ్రీప్రసాద్ ప్రతి సినిమాలో ఒక పాటను ఆయనే స్వయంగా పాడతారు. కానీ ఈ సారి మాత్రం సినిమాలో రవితేజ పాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు ఈ పాట ఉంటుందట. గతంలో కూడా తన సినిమాల్లో రవితేజ పాటలు పాడిన విషయం తెలిసిందే. బలుపు సినిమాలో 'కాజలు చెల్లివా', పవర్ సినిమాలో 'నా టన్ కి నా టన్ కి', డిస్కో రాజా సినిమాలో 'రమ్ పమ్ భమ్' అనే పాటలు పాడారు రవితేజ.

ఇక ఇప్పుడు కిలాడి సినిమాతో కూడా మరోసారి తన గొంతును సవరించనున్నాడు. ఇక త్వరలోనే దేవిశ్రీప్రసాద్ ఈ పాటను రికార్డ్ చేయనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా హైలెట్స్ లో ఈ పాట కూడా ఒకటి గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఈ పాట పై ఇప్పటినుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: