బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ప్రస్తుతం వందల కోట్ల బడ్జెట్ తో ఎక్కుతున్న సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియా రేంజిలో రూపొందుతున్న ఈ సినిమాలపై అటు భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇలా ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ప్రాజెక్టు కే సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా దొరకెక్కుతుంది. ఇక నాగ్ అశ్విన్ అంటే దాదాపు కథ కథనం బలంగా ఉంటాయని అందరూ భావిస్తూ ఉంటారు. దీంతో ప్రభాస్తో సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు పెట్టుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ప్రాజెక్టు - కే సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం కాస్త సోషల్ మీడియాలో తెగచకర్లు కొడుతుంది. భారీ అంచనాల నెలకొన్న ఈ సినిమా అదే రేంజ్ లో బిజినెస్ కూడా చేస్తుంది అన్నది తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో అటు ప్రాజెక్టు-కే ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని టాలీవుడ్  వర్గాల నుంచి సమాచారం. దీన్ని బట్టి ఇక సినిమా హైప్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.


 ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న   ఈ సినిమాను అటు వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఒక విజువల్ వండర్ గా ఉండబోతుందట. ఇక సినీ ప్రేక్షకులందరికీ కూడా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాడట నాగ్ అశ్విన్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన అటు దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక మరోవైపు ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: