
అయితే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నికకు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతికి ముందుగానే ఓడిపోతుందని తెలుసు. ఎందుకంటే ప్రచారంలో సైతం సీనియర్ నాయకుల నుండి సరైన మద్దతు వీరికి దక్కలేదు. ఇక బీజేపీ నుండి రాజగోపాల్ రెడ్డి మాత్రం గెలుపు కోసం ఎంతలా తపించారంటే... ఈ ఎన్నిక గెలవకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేంతలా ప్రచారంలో తన ప్రవర్తన ? చేసిన వ్యాఖ్యలు తెలిపాయి. కానీ ఓటమి గురించి తెలిశాక ఇతను చేసిన వ్యాఖ్యలు తాను ఇంకా భ్రమలో ఉన్నాడా అనిపించింది. ఎన్నికలో తెరాస అనైతికంగా గెలిచిందని ? ఈమె నైతికంగా గెలిచామని కవర్ చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఏమి చేయాలో పాలుపోవడం లేదని చెప్పాలి.
ఇప్పుడు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఈ ఓటమి రాజకీయ భవిష్యత్తును దూరం చేస్తుందా ? అన్న విషయం గురించి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మొదటి నుండి కూడా బీజేపీలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎటువంటి స్టెప్ ను తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది. బీజేపీ ఈ ఓటమి భారం నుండి రాజగోపాల్ రెడ్డిని ఆదుకుని ఏదైనా బాధ్యతను అప్పగించి అక్కున చేర్చుకుంటుందా లేదా ఇతనితో ఇంకేమి పని ఉందని పక్కకు వదిలేస్తుందా అన్న వాస్తవం తెలియాలంటే కొంతకాలం వరకు ఆగాల్సిందే.