కడప శివారులోని విమానాశ్రయం సమీప వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు. మరో ఐదు మంది గాయపడ్డారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కడప నుంచి ఎర్రచందనం వేసుకుని వెళ్తున్న సుమో విమానాశ్రయం సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొంది. స్కార్పియో నేరుగా టిప్పర్  డీజిల్ ట్యాంక్ ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్కార్పియోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. వీరితోపాటు ఎర్రచందనం దుంగలు కూడా కాలిపోయాయి.


మరో కారులో జరిగిన ప్రమాదంలో ఐదుగురు  గాయపడ్డారు. వారిని రిమ్స్​కు  తరలించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు, ఒక టిప్పర్ పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. స్కార్పియో తమిళనాడు నుంచి వస్తున్నట్లు సమాచారం. పోలీసులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. శవాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: