శీతాకాలం ఆరంభమవడం వల్ల హిమాచల్​ప్రదేశ్​లో భారీగా మంచు కురుస్తుంది. దీంతో మనాలి-లేహ్​ రహదారిని మంచు దుప్పటి కప్పేయడం వల్ల ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా భద్రత బలగాలు సహా ఆ మార్గంలో ప్రయాణించే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఖోక్సర్​, సిసు గొండోలా మధ్య తేలికపాటి హిమపాతం.. వాహనాల రాకపోకలను ప్రభావితం చేసింది. దీంతో పర్యటకులు సైతం ఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయంలో వాతావరణం బాగానే ఉంటుందని.. ఉదయం విపరీతంగా మంచు కురుస్తుందని స్థానికులు చెబుతున్నారు.


రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు అంగుళాల పరిమాణంలో మంచు పేరుకుపోయిందని అంటున్నారు.ఇటీవల ప్రారంభించిన అటల్​ టన్నెల్​ హిమపాతం వల్ల కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఎటువంటి అంతరాయం లేకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: