బిహార్​ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ​ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచార గడువు ముగిసింది.​ ఈ నెల 3న 94 స్థానాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.నంద్ ​కిశోర్​ యాదవ్​(పట్నా సాహిబ్​), రణ్​దీర్​ సింగ్​(మధుబన్​), శ్రవణ్​ కుమార్​(నలంద), తేజస్వి యాదవ్​(రాఘోపుర్​), తేజ్​ ప్రతాప్​ యాదవ్​(హసన్​పుర్​), లవ్​ సింగ్​(బంకిపుర్​) రెండో దశలో పోటీపడుతున్న ప్రముఖులు.


ఎన్​డీఏలో.. బిజేపి, జేడీయూ, హిందుస్థానీ అవామీ మోర్చా, వికాశ్​శీల్​ ఇన్సాన్​ పార్టీ ఉన్నాయి. బిజేపితో సన్నిహితంగా ఉన్న లోక్​జనశక్తి పార్టీ ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగింది. మహాకూటమిలో ఆర్​జేడీ, కాంగ్రెస్​, వామపక్షాలు ఉన్నాయి.243 సీట్లకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్టోబర్​ 28న తొలిదశ పూర్తయింది. ఆఖరి దశలో 78 స్థానాలకు నవంబర్​ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: