ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తుంది. ఊహించని రీతిలో పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో రోజు రోజుకి నమోదవుతున్న ప్రజలలో  ఎలాంటి భయం కనబడటం లేదు. చాలా రాష్ట్రాలు మరియు మెట్రో పాలిటన్ సిటీలు తిరిగి లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి నెలకొంది. దేశ ప్రధాను లను మొదలుకుని సామాన్యూయాలను వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు కరోనా వైరస్. ఎక్కడ చూసినా కరోనా మరణాలు, కరోనా పాజిటివ్ కేసులు.

IHG

ప్రపంచంలో పరిస్థితి ఇలా ఉన్నా గాని దేశంలో కామాంధుల ఆలోచనలు మాత్రం మారడం లేదు. పూర్తి విషయంలోకి వెళితే కరోనా బారిన పడిన వాళ్లని ప్రభుత్వాలు క్వారంటైన్ సెంటర్లకి తీసుకెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఇదే రీతిలో ఢిల్లీలో 14 ఏళ్ల బాలిక కరోనా బారిన పడటంతో  ఢిల్లీలోని చత్తార్‌పూర్‌లో ఉన్న సర్దార్ పటేల్ క‌రోనా సెంట‌ర్‌లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆ 14ఏళ్ల బాలికపై బాత్ రూమ్ దగ్గర 20 సంవత్సరాలు కూడా నిండని ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

IHG

ఈ సంఘటన ఈ నెల 15 తేదీ రాత్రి సమయములో జరిగినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. 20 ఏళ్ల యువకునితో పాటు మరో స్నేహితుడు కలిసి ఆ 14 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడడంతో పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టు చేసి జుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇదిలా ఉండగా ఈ లైంగిక దాడికి పాల్పడిన యువకుడు కూడా కరోనా రోగియే అవటంతో సదరు హాస్పిటల్ పై విమర్శలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: