ఇదివరకు
ఎమ్మెల్యే కు మన సమస్యలు చెప్పుకోవాలన్నా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. ముందు
ఎమ్మెల్యే అపాయింట్ మెంట్ దొరకాలి.. ఆయనకు కాళీ ఉండాలి. అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే మన సమస్యలు చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు సోషల్
మీడియా పుణ్యమా గల్లీ లీడర్ల నుండి
ఢిల్లీ రాజకీయనాయకుల వరకు అందరూ సోషల్ మీడియాలో ఉంటున్నారు. దాంతో ప్రజలు సోషల్ మీడియానే తమ సమస్యలు తీరే ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా హర్యానాలో కూడా ఓ యువతి సోషల్ మెడియాను ఉపయోగించే తన సమస్యను
ముఖ్యమంత్రి వరకు తీసుకువెళ్లింది. ఇంతకీ ఎవరా యువతి..ఏంటా సమస్య అనేది ఇప్పుడు చూద్దాం. హర్యానాలోని షహిరాబాద్ లో గల వార్డు నంబర్ 5 లో నివసిస్తున్న కామిని అనే యువతి తమ గల్లీ అంతా మురికి నీరుతో నిండిపోయిందని..ఫిబ్రవరి 16న తన
పెళ్లి జరుగబోతుందని కాబట్టి
పెళ్లి కొడుకు ఎలా వస్తాడు.?
భరత్ ఎలా చేసుకోవాలి అని ప్రశ్నిస్తూ
హర్యానా సీఎం కు టాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.
ఇక ట్వీట్ కాస్త వైరల్ అవ్వడంతో సీఎం కార్యాలయం ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ భాద్యులైన అధికారులకు నోటీసులు జారీచేసింది. వెంటనే బాద్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కామిని తన ట్వీట్ లో "
ఫిబ్రవరి 16న నా
పెళ్లి జరగబోతుంది. మా కాలనిలో మొత్తం మురుగు పారుతుంది. మా ఇంటికి
పెళ్లి కొడుకు ఎలా రావాలి.
భరత్ ఎలా చేయాలి. అసలు
పంచాయతీ వాళ్ళు గాని
స్థానిక ఎమ్మెల్యే గాని ఏమైనా చేస్తారా? లేదా" అంటూ ట్వీట్ లో నిలదీసింది. ఇక కామిని చేసిన ట్వీట్ తో తమ కాలనీ సమస్య తిరిపోయింది. ఇంకేముంది ఎంచక్కా కొత్త పెళ్ళి కొడుకు రావచ్చు...భరత్ కూడా చేయొచ్చు. కామిని స్పందించింది కాబట్టే తన పెళ్లికి కాలనీ శుభ్రం అవ్వబోతుంది. కబట్టి సమస్య వచ్చినప్పుడు అధికారులను నాయకులను అడగాల్సిందే.