కొన్ని కొన్ని సార్లు అనుకోని విధంగా మృత్యువు దరిచేరుతు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఊహించని ఘటన లు కేవలం క్షణాల వ్యవధి లోనే ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి. అందుకే మనిషి జీవితం దేవుడి చేతిలో కీలు బొమ్మల లాంటిది అని చెబుతు ఉంటారు. అంతే కాకుండా భూమి మీద నూకలు భాకి లేక పోతే ఎలాగైనా ప్రాణాలు పోతాయి అనడానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు తెర మీదికి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.



 బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఇంట్లో భారీ పేలుడు సంభవించడం తో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కాసేపటి వరకు అసలు ఏమి జరిగింది అన్న విషయం ఎవరికీ అర్థం కాలేదు. ఈ భారీ పేలుడు కి భవనం మొత్తం పూర్తిగా ధ్వంసం అయింది. అంతే కాదు ఈ ఘటన లో ఏకంగా ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం మాత్రం సంచలనం గా  మారి పోయింది అని చెప్పాలి. ఇలా ఒక్క సారిగా బాంబు పేలుడు సంఘటన జరగడం తో స్థానికులు అందరూ ఉలిక్కిపడ్డారు.


 తాతర్ పూర్ లో ఓ ఇంట్లో శుక్రవారం తెల్లవారు జామున పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ఘటన లో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పేలుడు ధాటికి ఒకటి కాదు ఏకంగా మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక సమాచారం అందుకున్న పోలీసులు అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక కుప్ప కూలిన శిధిలాల కింద ఏకంగా 15 మంది వరకు చిక్కుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇలా ఆసుపత్రికి తరలించే లోపే మరో నలుగురు కూడా ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. ఇక ఇంట్లో టపాకాయలు ఒక్కసారిగా పేలడం తో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: