ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వైసీపీ బీ ఫామ్ పై ఎంపీ గా గెలిచి, సొంత పార్టీ మరియు ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఘనుడు రఘురామ కృష్ణం రాజు. గతంలో ఎన్నో విషయాలలో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా మరో విషయంపై సీబీఐ కి లేఖ రాసి పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాడు. 2017 లో అప్పటి కడప ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఈయన హత్య జరిగి అయిదు సంవత్సరాలకు పైన అయింది. అయినా ఇప్పటికీ ఇతని కేసు పూర్తి కాకపోవడం విచారకరం.  

ఎందుకంటే ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి సొంత బాబాయ్ అయినా ఎందుకో సీబీఐ మెల్లగా అడుగులు వేస్తుంది అంటూ ఇంతకు ముందు ఎందరో విమర్శలు చేశారు. అయితే నేడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సీబీఐ ని ఉద్దేశించి లేఖ రాశాడు. ఇప్పటి వరకు సీబీఐ ఈ కేసును ఎందుకు వేగవంతంగా పూర్తి చేయడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఇందులో మరో కీలక వివాదాస్పద విషయం చెప్పడం కొసమెరుపు. ఎలా అయితే పరిటాల హత్యకు కారణం అయిన హంతకులను హత్య చేశారో అదే విధంగా ఈ కేసులోనూ నిందితుల పై కుట్ర జరుగుతోందని లేఖలో రాశారు. ఈ కేసుకు సంబంధించి జైలు బయట మరియు లోపల ఉన్న ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించాలని విన్నవించుకున్నారు.  

అంతే కాకుండా ఈ హత్య వెనుక కొన్ని మాస్టర్ మైండ్స్ పనిచేశాయని? వాటి గురించి పూర్తిగా తెలియాలంటే ఎంపీ విజయ్ సాయి రెడ్డిని విచారించాలని రఘురామ చెప్పారు. మరి ఈ లేఖలో సీబీఐ కి రాసిన అన్ని విషయాలను వారు పరిగణలోకి తీసుకుని విచారణ చేపడితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలియాల్సి ఉంది. అంతకన్నా ముందు రఘురామ పై వైసీపీ నాయకులు ఎవరిపైన మాటల దాడి చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: