మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కొత్త డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'విరూపాక్ష'. 'శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర' 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించడం జరిగింది.అజయ్, యాంకర్ శ్యామల, సునీల్, రాజీవ్ కనకాల, సాయి చంద్ ఇంకా అలాగే అభినవ్ గోమఠం వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా 'కాంతార' ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్లకి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక మొదటి రోజు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.మొదటి రోజు సూపర్ సాలిడ్ గా కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు మొదటి రోజుని మించి భారీగా కలెక్ట్ చేసింది.ఒకసారి ఈ సినిమా 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే..'విరూపాక్ష' సినిమాకి రూ.22.36 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.


సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఖచ్చితంగా రూ.22.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా మొత్తం రూ.13.51 కోట్ల షేర్ ను రాబట్టింది.అలాగే బ్రేక్ ఈవెన్ కు మరో రూ.9.29 కోట్ల షేర్ ను ఈ సినిమా రాబట్టాలి. ఆదివారం రోజు కూడా ఈ సినిమా చాలా భారీగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.ఇక ఈ సినిమా తెలుగులో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఈ సినిమాకి మిగతా భాషల్లో కూడా క్రేజ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాకి తమిళ, హిందీ భాషల నుంచి డిమాండ్ పెరుగుతుంది. సినిమాని త్వరగా డబ్ చేసి ఆ భాషలో రిలీజ్ చెయ్యమని డిస్ట్రిబ్యూటర్ల నుంచి డిమాండ్ పెరుగుతుంది.మొత్తానికి ఈ సినిమా కూడా పెద్ద పాన్ ఇండియా హిట్ సినిమాగా మారబోతోంది అనడంలో ఎలాంటి సందేశం లేదు. చూడాలి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో..ఇంకెంత వసూళ్లు రాబడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: