దేశంలో ఈ మద్య వివాహేతర సంబంధాలతో సొంత వారినే కడతేర్చుతున్న దారుణ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.   తాజాగా ఓ మహిళ తన కొడుకులాంటి మరిదితో అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్తను కడతేర్చిన ఘటన వెలుగు లోకి వచ్చింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరుకు చెందిన బైండ్ల చెన్నయ్య (38), శశికళ దంపతులు కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ప్రవీణ్, పావని అనే పిల్లలున్నారు.

 

శశికళ గత ఆరేళ్లుగా వరుసకు మరిది అయిన రమేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. ఈ వ్యవహారం కొంత కాలం గుట్టుగానే సాగినా.. ఈ మద్య రమేష్ తో ఉన్న అక్రమ సంబంధం గురించి భర్త చెన్నయ్య తెలిసింది. దాంతో శశికళ ను భర్త చెన్నయ్య పలుమార్లు మందలించాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని భావించిన శశికళ ప్రియుడితో కలిసి పథకం వేసింది. ఈ నెల 6న భర్త, ప్రియుడితో కలిసి పరిగి వచ్చారు. అక్కడ మద్యం కొనుగోలు చేసి అనంతగిరి ప్రాంతానికి చేరుకుని మద్యం తాగారు. మద్యం తాగి మత్తులోకి జారుకున్న చెన్నయ్యపై రాళ్లతో దాడిచేసి కిరాతకంగా చంపేశారు. గుట్టు చప్పడు కాకుండా ఆ మృతదేహం పై ఆకులు కప్పి వచ్చారు.

 

ఈ నెల 11న చెన్నయ్య తల్లి బాలమ్మ అనారోగ్యంతో మృతి చెందింది.  తల్లి చనిపోయింది.. అంత్యక్రియలకు కూడా రాకపోవడం ఏంటని బంధువులకు, గ్రాస్థులకు అనుమానం రావడంతో శశికళను నిలదీసి పంచాయతీ పెట్టాలని నిర్ణయించారు. దీంతో భయపడిన శశికళ 13న రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. తీవ్రంగా గాయపడిన శశికళ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  శశికళతో సన్నిహితంగా ఉండే రమేశ్‌ను నిలదీయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: