మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా శర వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన ముందుకు రాబోతున్నట్లు ఇదివరకే చిత్ర బృందం ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా అనుకున్నట్లుగా విడుదల కాలేదని రూమర్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండడం వల్లే.. ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ కారణమన్నట్లుగా సమాచారం.


ఇక వీటితోపాటు రీ రికార్డింగ్ పనులు కూడా మిగిలి ఉన్నాయని.. మ్యూజిక్ పరంగా తమన్ కూడా తమ సమయాన్ని కేటాయించాల్సి ఉందని ఇవన్నీ సమయానికి పూర్తి కాకపోవచ్చు అందుచేతనే డిసెంబర్ నెలకి ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీ పై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఓట్టి పుకార్లేనని.. కొట్టి పారేయడం జరిగింది. చెప్పిన సమయానికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఎలాంటి రూమర్స్ ని నమ్మవద్దని కూడా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం జరిగింది.


ఇక చిరంజీవి నటించిన అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోందని తెలియజేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా ప్రారంభించబోతున్నట్లుగా తెలియజేశారు. నిర్మాత ఎస్వీ ప్రసాద్. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిరంజీవి సినిమా కి తగిన ప్రమోషన్స్ చేయడం లేదని మెగా అభిమానులు సైతం నిరాశ చెందుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు గాడ్ ఫాదర్ పోటీ నుంచి తప్పుకోబోతున్నట్లు క్రియేట్ అయ్యాయని అభిమానులు కూడా గందరగోళానికి గురిచేసిందని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు  ఈ సినిమా విడుదల పై  క్లారిటీ ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: