ఇటీవల కాలం లో భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమయిన పరాజయం పాలైన సినిమా లైగర్..యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ ని హీరో గా పెట్టి, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రమిది..విడుదలకు ముందు పెద్ద హంగామా తో ట్రేడ్ లో మంచి పాజిటివ్ బజ్ ని ఏర్పాటు చేసుకున్న ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు వంటి స్టార్ హీరోల రేంజ్ లో జరిగింది అనటంలో ఆశ్చర్యం లేదు ..సుమారు 90 కోట్ల రూపాయిల బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత కనీసం 30 కోట్ల రూపాయిలు కూడా వసూలు చెయ్యలేక చతికిలపడింది..డిస్ట్రిబ్యూటర్స్ అసలే రాధే శ్యామ్ మరియు ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలతో నిండా మునిగిపొయ్యి ఉంటె, ఇప్పుడు లైగర్ సినిమా వాళ్ళని పాతాళలోకం లోకి తొక్కేసింది అనే నిజం ..కనీసం వారం రోజులు కూడా థియేటర్స్ లో నిలబడని ఈ సినిమాకి దాదాపుగా 60 కోట్ల రూపాయిల నష్టాలు వచ్చాయి.

అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కనీసం 30 కోట్ల రూపాయిలైనా నష్టపరిహారం చెల్లించాలంటూ పూరి మరియు ఛార్మి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారట..లైగర్ మూవీ ఫలితం తర్వాత వీళ్లిద్దరు గోవా కి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నారట..ఫోన్లు చేస్తుంటే కనీసం సమాధానం కూడా చెప్పడం లేదట..ఒకవేళ వీళ్లిద్దరి కాల్ కలిసిన కూడా మా దగ్గర మీకు ఇవ్వడానికి చిల్లి గవ్వ కూడా లేదంటూ మాట చాటేస్తున్నారట..ఇలా గత రెండు వారాల నుండి డిస్ట్రిబ్యూటర్స్ కి కనపడకుండా మొహాలు దాచేసుకొని తిరుగుతున్నారట ఛార్మి మరియు పూరి జగన్నాథ్..ఇక విజయ్ దేవరకొండ అయితే నాకేమి సంబంధం లేదు అన్నట్టు తన తదుపరి ప్రాజెక్ట్స్ పై ద్రుష్టి సారించాడు..లైగర్ సినిమా చేస్తున్న సమయం లోనే పూరి జగన్నాథ్ తో 'జన గణ మన' అనే సినిమాలో నటించడానికి విజయ్ దేవరకొండ ఒప్పుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే లైగర్ ఫలితం చూసిన తర్వాత అంత భారీ బడ్జెట్ ఈ సబ్జెక్టు కి వర్కౌట్ అవ్వదని ఆపేసినట్టు సమాచారం.

 
ప్రస్తుతం విజయ్ దేవరకొండ నిన్ను కోరి మూవీ ఫేమ్ శివ నిర్వాణ తో 'ఖుషి' అనే సినిమా చేస్తున్నాడు..ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమా తర్వాత సుకుమార్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు విజయ్ దేవరకొండ..ఈ రెండు ప్రాజెక్ట్స్ మీదనే ఆయన పూర్తి ఆశలు పెట్టుకున్నాడు..మరి ఫ్లాప్ స్ట్రీక్ నుండి ఈ రెండు సినిమాల ద్వారా బయటపడుతాడా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: