మెగా ఫ్యామిలీ అంటే సినీ  ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలోనే మెగాస్టార్ ఫ్యామిలీ టాప్ పొజిషన్ లో ఉందని చెప్పవచ్చు.అయితే చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయమయ్యారు. ఇక నాగబాబు,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్,అల్లు అర్జున్ వంటి హీరోలు రాగా ఆ తర్వాత యంగ్ హీరోలుగా వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్ లు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే  మెగా హీరోలు అందరూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ మెగా ఫ్యామిలీ పేరును మరింత విస్తరిస్తున్నారు.

అయితే  ఈ కారణంతోనే మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ గా మారిపోయింది. అంతేకాదు చాలామంది చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీకి వచ్చి ఆయన పేరును మరింత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దీంతో మెగా అభిమానుల్లో కూడా భారీ క్రేజ్ పెరుగుతోంది. అయితే ఈ విషయం పక్కన పెడితే..మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నిహారిక ను జొన్నలగడ్డ చైతన్య కి ఇచ్చి చాలా గ్రాండ్ గా వివాహం చేసింది మెగా ఫ్యామిలీ. చైతన్య కంటే ముందే నిహారిక ను మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తారని ఇండస్ట్రీ లో వార్తలు బాగానే వచ్చాయి.

అయితే  నిహారిక కూడా ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేలా సాయి ధరమ్ తేజ్ ని బావా బావా అంటూ చాలా సందర్భాల్లో పిలిచేది. ఇక పోతే సాయి ధరంతేజ్ కూడా నిహారిక అంటే చాలా ఇష్టమట.అయితే  ఎప్పటినుండో ఆమెకు చెప్పకుండా తానే వన్ సైడ్ లవ్ చేశాడట.అంతేకాదు నిహారిక కూడా బావ అని పిలవడం తో సాయి ధరమ్ తేజ్ లో ఆశలు మరింత రెట్టింపయ్యాయి కానీ ఈ విషయాన్ని మాత్రం భయంతో ఫ్యామిలీ వాళ్లకు చెప్పలేదు. ఇక ఈ విషయం తెలియని నాగబాబు తన కూతురికి సంబంధాలు చూస్తూ జొన్నలగడ్డ చైతన్య కి ఇచ్చి పెళ్ళి చేశాడు. సాయిధరమ్ తేజ్ మాత్రం ఏమీ చేయలేని స్థితిలో సైలెంట్ గా ఉండిపోయారట.అయితే ప్రస్తుతం నిహారిక పెళ్లి కి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: