
విడాకుల సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సమంత అయినా కూడా భయపడకుండా తనను తాను మరింత ధైర్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే వరుసగా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఈమె నటించిన యశోద సినిమా లేడీ ఓరియంటెడ్ చిత్రంగా వచ్చింది. సరోగసి కాన్సెప్ట్ పై తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సంపాదించింది అంతేకాదు సమంత ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో సినిమాను మరొక రేంజ్ కి తీసుకెళ్ళింది అని చెప్పడంలో సందేహం లేదు. యాక్షన్ సన్నివేశాలలో కూడా హీరోలతో పోటీపడి మరీ నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా సమయంలోనే తాను మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్నాను అని అభిమానులతో తెలియజేసింది.
అయితే కొన్ని రోజుల తర్వాత సమస్య సద్దుమణిగింది త్వరలోనే షూటింగ్లో పాల్గొంటుంది అని అనుకునే లోపే.. ఆ సమస్య ఆమెను మరింతగా బాదిస్తోందట. ఆ సమస్య తగ్గకపోవడంతో ప్రస్తుతం దక్షిణ కొరియాకు ట్రీట్మెంట్ కోసం వెళ్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా బాలీవుడ్లో రస్సో బ్రదర్స్ సిటాడేల్ మూవీ నుంచి సమంత తప్పుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్లో భారీ బడ్జెట్లో తెరకెక్కపోతున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్, సమంత జంటగా నటించబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి సమంత తప్పుకున్నట్లు టీం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం తన అనారోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకొని సమంత ఏ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సమాచారం.