మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా విరూపాక్ష. తేజ్‌ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తోన్న మొదటి చిత్రం ఇదే.టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా పై మెగా అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగాయి.ఇక కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సాయి ధరమ్  తేజ్‌కు జోడిగా సంయుక్త మీనన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. బ్లాక్‌ మ్యాజిక్‌ వంటి ఇంట్రెస్టింగ్‌ కథాంశంతో ఈ సినిమాని సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.కథ ఏంటన్నదానిపై అందరిలో ఈ సినిమా పీక్స్ లో క్యూరియాసిటీ పెంచేసిందీ మూవీ. ఇదిలా ఉంటే పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని ఏప్రిల్‌ 21 వ తేదీన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాష లలో కూడా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌ షురూ చేసిన మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేసింది.1.19 నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్‌ ఆద్యంతం ఎంతగానో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ టీజర్‌ చూస్తున్నంత సేపు ఊపిరి బిగపట్టుకొని చూసేలా అనిపిస్తుంది.


అంతలా ఈ టీజర్‌ చాలా ఆసక్తిగా ఉంది.బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడం అనేది నిజంగా గూస్ బంప్స్ తెప్పించే అంశం..ఇక ఈ టీజర్‌లో వచ్చే ‘ ఈ చరిత్రలో ఇలాంటి ఒక సంఘటన జరగడం ఇదే మొదటిసారి. దీని నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది’. ‘సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం కూడా అక్కడే వెతకాలి’. ‘ఆ ప్రమాదం దాటడానికే ఈ నా ప్రయాణం’ అనే డైలాగ్స్‌ అయితే గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉన్నాయి. ఇక బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ టీజర్‌కు మరింత హైప్‌ తీసుకొచ్చిందని చెప్పాలి.మరి పాజిటివ్‌ బజ్‌తో వస్తోన్న ఈ సినిమా సాయి ధరమ్ తేజ్‌ కెరీర్‌ను ఎలంటి మలుపు తిప్పుతుందో చూడాలి. గత కొన్నాళ్ళ నుంచి సరైన హిట్టు లేకుండా సతమతం అవుతున్న ఈ యంగ్ హీరోకి ఈ సినిమా ఎలాంటి హిట్ ని ఇస్తుందో చూడాలి. ఈ సినిమా ఖచ్చితంగా సాయి ధరమ్ తేజ్ ని పాన్ ఇండియా హీరోగా నిలబెడుతుందని మెగా ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: