టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఈ మూవీ కి హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు.

 ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ నగరపడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను భారీ ఎత్తున నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వరంగల్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది.

 ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నాగార్జున మాట్లాడుతూ ... అఖిల్ కు మా అందరి కంటే మూవీ లు అంటే పిచ్చ ఎక్కువ. అలాగే అభిమానులు అంటే ప్రేమ. అఖిల్ ఎనర్జీ మీరంతా ఇప్పుడు చూస్తున్నారు కానీ మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఆ ఎనర్జీని సురేందర్ రెడ్డి బయటకి తీశాడు. మూవీ బ్లాక్ బస్టర్ కావాలి అంటే ఏ అంశాలు ఉండాలో అవి ఏజెంట్ మూవీ లో ఉన్నాయి అని నాగార్జునమూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: