పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా సినిమాలన్నీ పూర్తి చేసి ఎన్నికల సమయాన్ని కల్లా రాజకీయాల్లో పాల్గొనేందుకు ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అందుకే ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాల పైన ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇక ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మరొక సినిమా అయిన ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజీ సినిమాలు కూడా ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇక సహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఓజి.

ఈ  కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి .అయితే గత కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. కాగా ఈ క్రమంలోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సెట్స్ లోకి అడుగుపెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .సముద్రఖని దర్శకత్వంలో బ్రో అనే సినిమా కూడా చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బ్రో ఇంకా ఓ జి  సినిమాలను కూడా ఒకేసారి పూర్తి చేయనున్నారు పవన్ కళ్యాణ్ .అయితే తాజాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓ జి సినిమా అనుకున్న దానికంటే ముందుగానే విడుదల కాబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాని అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కానీ ఎవరు ఊహించిన విధంగా అనుకున్న దానికంటే ముందుగానే ఈ సినిమా రాబోతున్నట్లుగా ఇప్పుడు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం  పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు బ్రో వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలో చేస్తున్నారు. ఇక బ్రో సుజిత్ సినిమాలను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ .దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: