ఐపీఎల్ మొదలైంది. క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైర్మెంట్ అందుతుంది. ఈ క్రమం లోనే అన్ని హోమ్ గ్రౌండ్ లలో కూడా మ్యాచులు జరుగుతూ ఉండడం తో ఇక ప్రతి ఒక్కరు కూడా స్టేడియం కు వెళ్లి మ్యాచ్ వీక్షిస్తూ ఉన్నారు. తమ అభిమాన జట్టుకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమం లోనే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠగా సాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇలా ఐపీఎల్ మ్యాచ్లను స్టేడియం లో చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఇక తమ అభిమాన ఆటగాళ్ల గురించి ఏదో ఒక ఫ్లకార్డు పట్టుకోవడం చూస్తూ ఉంటాం.


 ఇలా ప్రేక్షకులు పట్టుకునే ఫ్లకార్డులు కొన్ని కొన్ని సార్లు కెమెరాల కంటపడుతూ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక యువకుడు ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వచ్చి ప్రదర్శించిన ప్లకార్డు మాత్రం హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. బెంగళూరులో అద్దెకు ఇల్లు దొరకడం మహా కష్టంగా ఉంది. అద్దె ఇల్లు కోసం జనం పడుతున్న కష్టాలు అన్ని కావు అంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అయితే బెంగళూరులో ఇల్లు అద్దెకు దొరకాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఈ యువకుడు చేసిన పని చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది.


 ఒకవైపు స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంటే ఇతను మాత్రం స్టేడియంలో నిలబడి ఇందిరా నగర్ లో తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు కావాలి అంటూ ఫ్లకార్డు పట్టుకుని నిలబడ్డాడు. ఈ సందర్భంలో తీసిన ఫోటోని ఒక నేటిజన్ ట్విట్టర్ వైదికగా షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసి ఐపీఎల్ ను జనాలు ఇలా కూడా వాడేసుకుంటున్నారా అని ఎంతమంది కామెంట్లు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl