అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు జీవితంలో విషాదం నింపుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో కుటుంబాల విషయంలో వీధి కక్ష కట్టినట్లు వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రియమైన వారిని దూరం చేస్తూ కుటుంబాలను శోకసంద్రంలో ముంచేస్తూ ఉంటుంది.  ఇలా ఊహించని ఘటన లు ఎన్నో కుటుంబాలు అరణ్యరోదన మిగులుస్తూ  ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కొడుకు మరణాన్ని తట్టుకోలేక పోయిన ఆ తండ్రి చివరికి ఈ జీవితం వృధా అని అనుకున్నాడు. కొడుకు లేని జీవితం నాకెందుకు అనుకున్నాడో ఏమో కొడుకు మరణ వార్త వినగానే ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.



 కొడుకు పుట్టగానే ఎంతో సంతోష పడిపోయిన ఆ తండ్రికి అంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది అని మాత్రం ఊహించలేకపోయాడు కొడుకుకి ఏ కష్టం రాకుండా పెంచిన తండ్రి చిన్న వయసులోనే కొడుకు ప్రాణాలు వదలడంతో ఒక్కసారిగా గుండెలు అలసిపోయేలా రోదించాడు. చివరికి కొడుకు మరణవార్త తండ్రి ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఈ విషాదకర ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్ నగర్ కు చెందిన లక్ష్మణ్ అనూష దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కుమారుడు పుణీత్ కి తొమ్మిది ఏళ్ళు ఉంటాయి. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఇటీవలే పునీత్ కు ఫిట్స్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే హైదరాబాద్లో ఉన్న నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.



 అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు చికిత్స తీసుకొని కోలుకుంటాడులే అని ఆ తండ్రి మొక్కని మొక్క లేదు చేయని పూజ లేదు. కానీ చివరికి పునీత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కొడుకు మృతి చెందిన విషయం తండ్రి చెవిన పడగానే ఆ తండ్రి గుండె పగిలిపోయింది. గుండెలవిసేలా ఏడ్చిన ఆ తండ్రి కొడుకు లేని జీవితం వృధా అని అనుకున్నాడు. చివరికి తండ్రి లక్ష్మణ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. అయితే కేవలం గంటల వ్యవధిలోనే తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన  గ్రామంలో అందరిని కంటతడి పెట్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: