సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని అద్భుతమైన క్రేజ్ ను సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంటూ ఉంటారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ దర్శకుడి గా గుర్తింపు ను తెచ్చుకున్న వారిలో బుచ్చిబాబు సన ఒకరు.

ఈ దర్శకుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఉప్పెన మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన మొదటి మూవీ ఉప్పెన బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. దానితో ఈ దర్శకుడి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే ఉప్పెన మూవీ తర్వాత ఈ దర్శకుడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక భారీ మూవీ చేయబోతున్నట్లు కొన్ని వార్తలు బయటికి వచ్చాయి.

ఇప్పటి వరకు ఈ మూవీ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఇది ఇలా ఉంటే బుచ్చిబాబు తాజాగా మరో స్టార్ హీరో పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ దర్శకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో భారీ బడ్జెట్ తో ఒక పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: