మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా శ్రీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభం లో తెలుగు లో మల్లీశ్వరి , అల్లరి పిడుగు వంటి మూవీ లలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక బాలీవుడ్ మూవీ లలో నటించి ,  అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక విజయాలను అందుకొని ప్రస్తుతం హిందీ పరిశ్రమ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం కూడా కత్రినా కైఫ్ వరుస హిందీ మూవీ లలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్  జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం కత్రినా కైఫ్ , విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా కత్రినా కైఫ్ తన పెళ్లి లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది. తన పెళ్లిలో కొంత మంది చెప్పులతో కొట్టుకున్నారు అని కత్రినా కైఫ్ తాజాగా తెలియజేసింది. పెళ్లి పందిట్లో కూర్చున్న నాకు వెనకాల నుండి చాలా గట్టిగా అరుపులు వినిపించాయి ... ఎంటా అని చూస్తే ... అక్కడ చెప్పులతో విసురుకుంటూ కొట్టుకుంటున్నారు. వాళ్లలో నా చెల్లెలు ,  విక్కీ స్నేహితులు కూడా ఉన్నారు. ఆ ఫైట్ లో ఎవరు గెలిచారో మాత్రం అడగడమే మర్చిపోయాను. అని తాజాగా కత్రినా కైఫ్ తన పెళ్లిలో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా కత్రినా కైఫ్ "ఫోన్ బూత్" అనే మూవీ లో నటించింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: