బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హృతిక్ రోషన్ ఇప్పటివరకు నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ ఈ హీరో నటించిన హిందీ సినిమాలు అయినటు వంటి క్రిష్ , ధూమ్ సినిమాలు తెలుగు లో కూడా విడుదల అయ్యి మంచి విజయాలను సాధించడం తో  , ఈ మూవీ ల ద్వారా  హృతిక్ రోషన్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా హృతిక్ రోషన్ "విక్రమ్ వేద" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదలై మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మూవీ లోని నటన కు గాను హృతిక్ రోషన్ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ రాసిన వార్తలను హృతిక్ రోషన్ ఖండించారు. హృతిక్ రోషన్ మరియు సబా ఆజాద్ ముంబై లోని ఒక అపార్ట్‌మెంట్‌ లోకి మారాలని ప్లాన్ చేసుకున్నారు. అందు కోసం హృతిక్ రోషన్ భారీగా ఖర్చు చేసినట్లు మీడియా కూడా పేర్కొంది. ఈ వార్తలపై స్పందించిన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలను ఖండిస్తూ ఓ పోస్ట్ చేయడం జరిగింది. ముంబై లోని ఒక అపార్ట్‌మెంట్‌ లోకి మారాలని ప్లాన్ చేసుకున్నారు అని వచ్చిన వార్తలు ఏ మాత్రం నిజం లేదు అని హృతిక్ రోషన్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో హృతిక్ రోషన్ "ఫైటర్" మూవీ తో ప్రేక్షకులను పలకరించానున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: