టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా నటించిన సినిమా దసరా. ఇక ఈ సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది.నాని ఇప్పటి దాకా నటించిన సినిమాలన్నింటి కంటే కూడా దసరా పెద్ద సినిమా కానుండడంతో పైగా పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇంకా అంతే కాదు నానికి ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్, పాటలు రిలీజ్ అయ్యి చాలా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. దసరా సినిమాకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా..ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.ఇక దసరా సినిమా టికెట్ బుకింగ్ విషయానికొస్తే యూఎస్ బుకింగ్ లు మార్చి 14వ తేదీ నుంచే స్టార్ట్ అయ్యాయి. ప్రీమియర్ అమ్మకాలు ఇప్పటికే మొత్తం 100 వేల డాలర్ల మార్కుకు చేరుకుని రికార్డు రేంజ్ లో దూసుకుపోతున్నాయి. దీంతో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ మొదలైంది.


ఇక ఇప్పుడు దేశంలో బుకింగ్ లకు అంతా సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో దసరా సినిమా బుకింగ్‌లు మార్చి 24వ తేదీ రాత్రి నుంచే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇక ప్రారంభ రోజు బుకింగ్‌లు చాలా వేగంగా, భారీగా ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది.నాని మూవీ దసరా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల గ్రాస్‌ను ఈజీగా టచ్ చేస్తుందని ఆయన ఫ్యాన్స్ తో పాటు మేకర్స్ కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దసరా మూవీ బుకింగ్‌లు బుక్ మై షో (Bookmyshow), పేటీఎం (Paytm) ప్లాట్‌ఫారమ్‌లలో ఆడియన్స్ కి అందుబాటులో ఉన్నాయి. ఏఎంబీ సినిమాస్, ఏషియన్ సినిమాస్ లాంటి మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధరలు రూ.295 గా ఇంకా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.175గా నిర్ణయించినట్టు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: