బాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న హీరో షారుక్ ఖాన్ గురించి ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గడిచిన కొన్ని సంవత్సరాలనుంచి వరుస ప్లాపులతో సతమతమవుతున్న షారుక్ ఖాన్ ఈ ఏడాది పఠాన్ చిత్రంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా బాలీవుడ్ కు మళ్ళీ ఆశ కలిగించేలా చేశారు షారుక్ ఖాన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నారు.


ఇందులో హీరోయిన్గా నయనతార నటించాక విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తూ ఉన్నారు.ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోని తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం జవాన్ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్లను ఇస్తూ వస్తోంది చిత్ర బృందం. ఈ సినిమాతో మరొకసారి షారుక్ తన యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ సినీ ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ సినిమా జూన్ 2వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం అనుకోగా కొన్ని కారణాల చేత ఈ సినిమాని వాయిదా వేయవలసి వచ్చింది.


సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. అలాగే హీరోయిన్ దీపికా పదుకొనే ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా హక్కులను హిందీ ,తమిళ్, తెలుగు భాషలలో ఎస్ రాజ్ ఫీలింగ్స్ చేజిక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను కూడా భారీ ధరకే అమ్ముడుపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి షారుక్ ఖాన్ ఏ విధంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారా తెలియాలి అంటే సెప్టెంబర్ 7 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: