మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరులో నిర్వహించడం జరిగింది.ఈవెంట్లో భాగంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి ఆ తర్వాత తన పరిస్థితి గురించి తెలియజేస్తూ బాగోద్వేగానికి గురయ్యారు.. సాయి ధరంతేజ్ మాట్లాడుతూ .. మీ ప్రేమను పొందాలనేదే నా లక్ష్యం దానికోసం నేను ఎంత వరకు అయినా వెళ్తాను అంటూ తెలియజేశారు.



మీ అందరితో ఎలాగైనా మాట్లాడాలనుకున్నాను మీ ప్రేమను పొందే క్రమంలో ఎన్నో ఆటంకాలు వచ్చిన తట్టుకొని నిలబడ్డాను.. తల్లితండ్రులకు గురువులను గర్వపడేలా చేయాలంటూ ఫ్యాన్స్ కి తెలియజేశారు.. తన జీవితంలో బైక్ యాక్సిడెంట్ ఊహించలేదు మీ అందరిని టెన్షన్ లో పెట్టినందుకు క్షమించండి ఆ సమయంలో అమ్మ, తమ్ముడితో మాట్లాడేందుకు కూడా మాటలు రాలేదని తెలిపారు. తనకు జరిగిన ప్రమాదం మరెవరికి జరగకూడదు అని స్టేజ్ మీద హెల్మెట్ చూపిస్తూ అందరూ హెల్మెట్ ధరించాలని తెలియజేశారు.


యాక్సిడెంట్ తర్వాత సాయి ధరంతేజ్ మాట తీరులో మార్పు వచ్చిందని ఈ విషయాన్ని అందరూ ఎగతాళిగా మాట్లాడుతున్నారు.. కానీ ఆ బాధని తలుచుకుంటే తనకి భయం వేస్తుందని తెలిపారు. బాధ ప్రతి ఒక్క మనిషిని మారుస్తుందని.. తెలిపారు. సుకుమారు కూడా స్టేజ్ మీద మాట్లాడుతూ గతంలో చాలా చలాకీగా జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉండే సాయి ధరంతేజ్ ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి అంటూ తెలిపారు. ఇక విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ కూడా లైఫ్ని రిస్క్ లో ఉన్న ఈ సినిమా చేసి పోదాం అనుకున్నాడు కానీ మెడిసిన్ తో తన వ్యాధి తగ్గింది సినిమాను కూడా చాలా గొప్పగా తీశామని తెలిపారు. సుకుమారు కూడా ఈ చిత్రంలో భాగస్వామ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: