తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఆఖరుగా కళ్యాణం కమనీయం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. 

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇలా కళ్యాణం కమనీయం సినిమాతో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఈ యువ హీరో తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అన్ని మంచి శకునములే అనే సినిమాలో హీరో గా నటించాడు. మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని మే 18 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై జనాల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుందో ... లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: