సైన్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పుణెలోని ఆర్మీ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫిజికల్​ ట్రైనింగ్​ (ఏఐపీటీ)లో జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష సందర్భంగా దక్షిణ కమాండ్​ లైజాన్​ విభాగం( సైనిక నిఘా విభాగం), పుణె క్రైం బ్రాంచ్​ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్​ నిర్వహించి.. ఈ రాకెట్​ను పట్టుకున్నారు. ఓ ఆర్మీ జవాను సహా ముగ్గురిని అరెస్ట్​ చేశారు.


ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షలు తీసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు పోలీసులు. వన్​వాడీ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరు ఇతర నియామకాల్లోనూ పాల్గొనటం సహా మరింత మంది ఈ రాకెట్​లో భాగమై ఉండొచ్చనే అంశంపై క్రైం బ్రాంచ్​ దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: