సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడు పేరుకు తగినట్లే సంచలన కామెంట్లు చేస్తూ.. వివాదాల్లో కావాలని తల దూర్చుతూ ఉంటాడు. ఇక కరోనా మొదలైనప్పటి నుంచి ఆయన ట్విటర్ వేదికగా రకరకాల ట్వీట్లు చేస్తూ తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. కరోనాను, కరోనా కట్టడిలో విఫలమవుతున్నా ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ ఇప్పటికే చాలా సార్లు సంచలన ట్వీట్లు చేశాడు. ప్రధాని మోదీని సైతం తన ట్వీట్లతో ట్రోల్ చేశాడు. మోదీ గడ్డంపై కూడా జోకులు పేల్చాడు. ఇక తాజాగా ఆర్జీవీ తన కోపాన్ని దేవుడిపై కూడ చూపించాడు. ఈ ప్రపంచాన్ని దేవుడే సృష్టించాడని అంటారని, అయితే ఎంతోమంది ప్రాణాలను హరించి వేస్తున్న కరోనాను కూడా దేవుడే సృష్టించి ఉంటాడని, అలాంటి దేవుడిని ప్రార్థించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు.

‘ఈ ప్రపంచం మొత్తాన్ని దేవుడే సృష్టించాడని చెబుతారు. అదే నిజమైతే ప్రస్తుతం మనకెంతో ఇష్టమైన వారిని చంపుకుని తీసుకెళుతున్న కరోనాను కూడా దేవుడే సృష్టించి ఉంటాడు కదా. అలాంటప్పుడు ఆ దేవుడినే మళ్లీ మనం ఎందుకు ప్రార్థిస్తున్నాం..’ అని ప్రశ్నించాడు. ట్వీట్ చివర్లో వరుసగా ప్రశ్నార్థకం సింబల్స్‌ను పెట్టాడు. అంటే దాని ద్వారా తాను ఆ ప్రశ్నను ఎంత గట్టిగా చెప్పాలనుకుంటున్నాడో వాటి ద్వారా చెప్పాడనిపిస్తోంది..

కాగా.. ఆర్జీవీ స్నేహితుడు శేఖర్ ఈ రోజు కరోనా కారణంగా మరణించినట్లు ఆర్జీవీ స్వయంగా తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు .శేఖర్ మరణం చాలా బాధిస్తోందని, తనకు అతడు చాలా కావలసిన వ్యక్తిని, తన జీవితంలో అతడు చాలా కీలకమని ఆ ట్వీట్లో ఉద్వేగపూరితంగా రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఈ ట్వీట్ ద్వారా ఆయనకు సన్నిహితులకు, తెలిసిన వారికి అందరికీ ఆయన మరణ వార్త చేరవేస్తున్నానని ఆర్జీవీ తన ట్వీట్లో పేర్కొన్నాడు. శేఖర్ లేని లోటు నిజంగా ఎవరూ తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శీంతి కలగాలని ‘RIP’ సందేశంతో ట్వీట్‌ను ఎండ్ చేశాడు. అలాగే ఈ ట్వీట్‌కు శేఖర్ మృతిపై టైమ్స్ ఆఫ్ ఇండియాలో వ్చిన ఓ కథనాన్ని జత చేశాడు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: