
సుకుమార్ అసలు పేరు సుకుమార్ బండ్రెడ్డి. జననం 11 జనవరి 1970న తూర్పు గోదావరి జిల్లా రాజోలు సమీపంలోని మెట్టపర్రులో జన్మించారు. సుకుమార్ కాకినాడలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో ఒక గణిత, భౌతిక లెక్చరర్ గా దాదాపు ఆరు సంవత్సరాలు పని చేశారు. ఆ తరువాత రచయిత నుంచి డైరెక్టర్ గా మారారు.
సహాయ దర్శకుడు
క్షేమంగా వెళ్లి లాభంగా రండి (2000), హనుమాన్ జంక్షన్ (2001) చిత్రాలకు జయం రాజా తండ్రి మోహన్కి సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. సుకుమార్ దిల్ (2003) చిత్రానికి వివి వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు.
సుకుమార్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి '1: నేనొక్కడినే' అనే చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్తో కలిసి పని చేశారు.
నిర్మాతగా మారిన వేళ...
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో సుకుమార్ "కుమారి 21 ఎఫ్" అనే సినిమాతో నిర్మాతగా మారారు. 2015లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్.
శాఖాహారిగా మారిన సమయం
6 సంవత్సరాల వయస్సులో ఆయనకు ఇష్టమైన కోడిని చంపిన తరువాత, సుకుమార్ శాఖాహారాన్ని తినడం ప్రారంభించాడు.
'పుష్ప' ఫైర్ తగ్గేదే లే !
సుకుమార్ తొలి చిత్రం 'ఆర్య' 40 మిలియన్ల బడ్జెట్తో రూపొంది రూ.160 మిలియన్లు వసూలు చేయడంతో వాణిజ్యపరంగా విజయవంతమైంది. 'ఆర్య' విజయం సుకుమార్ను రాత్రికి రాత్రే టాలీవుడ్ లో స్టార్డైరెక్టర్ ను చేసేసింది ఈ సినిమా. ఇప్పుడు మరోసారి బన్నీ, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' ఫైర్ ఇంకా చల్లారలేదన్న విషయం తెలిసిందే.